జాతీయ వార్తలు

బీజేపీకి అధికారం.. వాజపేయి కృషే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి చేసిన కృషి, త్యాగాల మూలంగానే బీజేపీ ఈ స్థాయికి చేరిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వాజపేయి జ్ఞాపకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనారోగ్యం మూలంగా వాజపేయి దాదాపు ఎనిమిదేళ్లపాటు రాజకీయాలు, ప్రజాజీవనానికి దూరంగా ఉన్నా ఆయన మరణించినప్పుడు ప్రజల నుండి వ్యక్తమైన ప్రేమాభిమానాలు ఆశ్చర్యం కలిగించాయని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు వాజపేయి పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శమని అన్నారు. వాజపేయి అధికారంకోసం పాకులాడకుండా మొదట జనసంఘ్, ఆ తరువాత భారతీయ జనతా పార్టీని ఇటుక మీట ఇటుక పెట్టుకుంటూ నిర్మించారని అన్నారు. వాజపేయి పలు సంవత్సరాలపాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు తప్ప అధికారం, రాజకీయాల కోసం సిద్ధాంతాలతో రాజీపడలేదని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుండి నిర్మించారు.. అందుకే బీజేపీ ఈ రోజు కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని ఆయన చెప్పారు. వాజపేయి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప రాజకీయాలకు కాదు.. అందుకే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జనసంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారని అన్నారు. ఆయన పార్టీ, రాజకీయాల కంటే దేశం, ప్రజాస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాన మంత్రి తెలిపారు. తమ పార్టీలో చేరితే అధికారం ఇస్తాం.. నాయకత్వం ఇస్తామంటూ పలువురు ఆయనకు ఆశ చూపించారు.. అయితే వాజపేయి మాత్రం వీటికి లొంగకుండా ఏకాగ్రతతో బీజేపీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు.. అందుకే తామీస్థితిలో ఉన్నాం.. దేశంలోని ప్రతి ప్రాంతంలో కమలం వికసిస్తోందని మోదీ చెప్పారు. వాజపేయి పుట్టిన రోజు డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అమిత్ షా చెప్పారు.
చిత్రం..పార్లమెంటు ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వాజపేయి
జ్ఞాపకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ