జాతీయ వార్తలు

రాహుల్ ప్రధాని కావడం కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ కూటమి పేరుతో ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఆ ఫ్రంట్‌లో చేరితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఫెడరల్ ఫ్రంట్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ చేరిపోతే కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు గండి పడుతుందని వారు చెబుతున్నారు. ఇదే జరిగితే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి
చేపట్టటం కల్ల అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మరాఠా నాయకుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషననల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండటం తెలిసిందే. ప్రజాఫ్రంట్ ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని డీఎంకే అధినేత స్టాలిన్ ఇటీవల ప్రకటించటం తెలిసిందే. చంద్రశేఖరరావు ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపిన అనంతరం సోమవారం కోల్‌కత్తాలో మమతా బెనర్జీతో నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు. కాంగ్రెస్, బీజేపీని పక్కనబెట్టి ప్రాంతీయ పార్టీలతో కూడిన తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ఢిల్లీలో అధికారంలోకి రావాలన్నది చంద్రశేఖరరావు ఆలోచన. దీనివలన రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావాలన్న చంద్రబాబు నాయుడు వ్యూహం ఊహించని స్థాయిలో దెబ్బతింటుంది. చంద్రశేఖరరావు తాజాగా ప్రారంభించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఎంతమాత్రం నచ్చటం లేదు. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ చాలా జాగ్రత్తగా రాజకీయం నడిపిస్తున్నారు. చంద్రబాబు కోల్‌కతా వెళ్లి చర్చలు జరిపినప్పుడు.. ఆ తరువాత ఆమె ఢిల్లీకి వచ్చి జాతీయ ప్రజాకూటమి సమావేశానికి హాజరైనప్పుడు కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వం లేదా రాహుల్ గాంధీ నాయకత్వం గురించి పల్లెత్తు మాట కూడా చెప్పలేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధంగా లేరనేది అందరికీ తెలిసిందే. మాయావతి, అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వారిద్దరూ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదు. రాజకీయ ఉద్దేశ్యంతోనే వారీ ప్రమాణ స్వీకారాలకు రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్ల విషయంలో ఎస్పీ, బీఎస్పీ ఒక అవగాహనకు రావటంతోపాటు ఆర్‌ఎల్‌డిని తమతో చేర్చుకున్నారు. వారీ ప్రక్రియలో కాంగ్రెస్‌కు ఎలాంటి స్థానం కల్పించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం రాయబరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలు మినహా మిగతా లోక్‌సభ సీట్ల విషయంలో ఎస్పీ, బీఎస్పీ ఒక అవగాహనకు రావటం ద్వారా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయటం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదనే సంకేతాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్, మాయావతి కూడా చంద్రశేఖరరావుతో చేతుల కలిపి నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ కూటమిలో చేరిపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని జాతీయ ప్రజా కూటమి చతికిల పడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.