జాతీయ వార్తలు
సీఎం వ్యాఖ్యలతో వివాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 26 December 2018
బెంగళూరు, డిసెంబర్ 25: మాండ్యాలో ఓ జేడీఎస్ కార్యకర్త హత్యకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. ఈ హత్యకు బాధ్యులైన వారిని విచక్షణారహితంగా కాల్చిపారేయండి అంటూ ఓ పోలీసు అధికారిని ఆయన ఆదేశించడం వైరల్గా మారింది. అయితే తన ఆవేదనను తట్టుకోలేకే అలా మాట్లాడానే తప్ప అందులో నిజమైన ఉద్దేశం లేదని కుమారస్వామి తెలిపారు. అయితే విపక్షాలు మాత్రం ఆయన ప్రకటనను బాధ్యతారహితమైనదిగా పేర్కొంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సోమవారం రాత్రి ప్రకాష్ అనే జేడీఎస్ కార్యకర్తను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. కారులో వెళుతున్న ప్రకాష్ను ఆపిన ఆ దుండగులు అత్యంత హే యంగా హతమార్చిన విషయం తెలిసిందే.