జాతీయ వార్తలు

నేడు ‘వంచనపై గర్జన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోసహా విభజన హామీల అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం వంచనకు గురి చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గురువారం ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, తాజా మాజీ ఎంపీలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, వివిధ విభాగాల నాయకులు పాల్గొంటారు. బుధవారం ఢిల్లీలోని దీక్ష శిబిరాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయ సాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యానారాయణ తదితరులు సదర్శంచి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వంచనపై గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు. దీక్షకోసం పార్టీ నాయకులు బుధవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకున్నారు.