జాతీయ వార్తలు

సికింద్రాబాద్ నుంచే పోటీచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. దత్తాత్రేయ గురువారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తనను గవర్నర్‌గా పంపించి మరొకరిని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తారని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇదే విషయం విలేఖరులు అడగ్గా ‘2019 లోక్‌సభ ఎన్నికే కాదు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ నుంచి నేనే పోటీచేస్తా’అని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందని ఆయన గుర్తుచేశారు. ‘నేను రాజభవన్‌కు వెళ్లను. రాజ్యసభకు వెళ్లను. నేను ప్రజా భవన్‌లోనే ఉంటాను’ అని బండారు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.