జాతీయ వార్తలు
ఓటర్ల గల్లంతుకు ఎన్నికల సంఘమే కారణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసింది. గురువారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు తదితరులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని అందులో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలాది మంది ఓటర్ల పేర్లు గల్లతవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ బలమున్నచోట ఓటర్ల సంఖ్య తగ్గిందని, అదే మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరింగిందని అన్నారు. ఇదంతా అనుమానాలకు తావిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తమ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్టు లక్ష్మణ్ తెలిపారు.