జాతీయ వార్తలు

విభజన హామీలపై వివరణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణకు తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తి చేయకపోవటంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పొన్నాల శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆదివారం పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించడాన్ని తప్పుపట్టారు. కాగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జీలు చేయడం, కాల్పులు జరుపుతున్న విషయం మోదీకి తెలుసా? అని ప్రశ్నించారు. బాధిత రైతుల వద్దకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధులకు సైతం అనుమతి ఇవ్వటం లేదని ఆరోపించారు. బయ్యారం సిమెంట్ కార్మాగారం నిర్మాణం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమైందని నిలదీశారు. విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా హైకోర్టును ఇంతవరకు ఎందుకు విభజించలేదని ఆయన అడిగారు.