జాతీయ వార్తలు
శాంతి భద్రతలకు భంగం కలుగనివ్వొద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 February 2019
పుదుచ్చేరి, ఫిబ్రవరి 16: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి వి.నారాయణ సామి శనివారం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని తన మద్దతుదారులను కోరారు. కిరణ్ బేడి తన ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల ‘ప్రతికూల వైఖరి’ని కలిగి ఉన్నారని, ఆ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆరోపిస్తూ నారాయణ సామి తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఇక్కడి ‘రాజ్ నివాస్’ ఎదుట గత మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరికి నిరసనగా కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో శనివారం నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నారాయణ సామి తెలిపారు.