జాతీయ వార్తలు

హిందువులపై దుష్ప్రచారం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. హిందువుల ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు సైతం తెగిస్తూ రాజకీయాలు సాగిస్తోందని కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీని ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’గా పిలవాల్సినంతగా రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర ఆరోపించారు. హిందువులపై దుష్ప్రచారం చేస్తూ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తున్న కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’గా పిలవాల్సి వస్తోందని సంబిత్ విమర్శించారు. కాంగ్రెస్ హిందువులపై చేస్తున్న దుష్ప్రచారానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్టల్రో బీజేపీ అడ్డుకోవాలని ముస్లింలు పేర్కొనడంతో వారి కోసం కేవలం కాంగ్రెస్ శివసేనతో చేతులు కలిపి అధికారం చేపట్టిందని అన్నారు. దీనినిబట్టి చూస్తుంటే హిందువులు సహా ఏ ఇతర పార్టీలకూ ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఏమీ చేయలేరని స్పష్టవౌతోందని పాత్ర ఎద్దేవా చేశారు.