జాతీయ వార్తలు

కాలుష్య కుంపట్లో 21 నగరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఈ వార్త వింటే గుండె గుభేలుమంటుంది. ప్రపంచంలో వాయు కాలుష్య కోరల్లో 30 నగరాలు చిక్కుకుంటే, అందులో 21 మన దేశంలో ఉన్నాయి. అంతేకాదు సుమా! భారత దేశం ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచింది. ఐక్యూఏయిర్ సంస్థ గత ఏడాది ప్రపంచంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 30 వాయు కాలుష్య నగరాల్లో 21 భారత దేశంలోనే ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో ఘజియాబాద్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని చైనాలోని హోటన్‌కు లభించింది. పాకిస్తాన్‌లోని గుజ్రన్‌వాలా, ఫైస్లాబాద్ నిలువగా, ఢిల్లీ ఐదవ స్థానంలో ఉంది.