జాతీయ వార్తలు

కేరళలో కరెన్సీ రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలప్పురం, డిసెంబర్ 24: కేరళలోని తిరూర్ ప్రాంతంలో కరెన్సీ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 40 లక్షల రూపాయల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కొత్త రెండు వేల రూపాయల నోట్లేనని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిరూర్ బస్టాండ్‌లో 63 ఏళ్ల వృద్ధుడిని అరెస్టు చేసి మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు జరిపి 36 లక్షల 98 వేల రూపాయల కనుగొన్నారు. తాము స్వాధీనం చేసుకున్న నగదంతా కొత్త రెండువేల రూపాయలేనని పోలీసులు వెల్లడించారు. పలక్కాడ్ జిల్లాకు చెందిన ఆలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.