జాతీయ వార్తలు
మాకూ జరీబు ప్యాకేజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 October 2018
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: అమరావతి ప్రాంతంలో జరీబు భూములున్న రైతులకు ఇస్తున్న ప్యాకేజీని అసైన్డ్ భూములున్న రైతులకు కూడా ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని ప్రాంత గ్రామాల దళిత రైతులు జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన దళిత రైతులు, వైఎస్సాఆర్సీపీ బాపట్ల పార్లమెంటరీ నియోజగవర్గ ఇంచార్జీ సురేష్బాబు నేతృత్వంలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిసి ఒక వినతి పత్రాన్ని అందించారు. 75 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 6వేల దళిత కుంటుంబాలు 7,500 ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, నూతన రాజధాని నిర్మాణం పేరిట దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.