జాతీయ వార్తలు
కేంద్ర సహకారాన్ని కోరుతున్నాం:నవీన్ పట్నాయక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 May 2019
న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదవసారి అధిష్టించనున్న బీజేడీ నేత నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో చెలిమి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సందేశం పంపారు. తాము కేంద్రం నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొనటం గమనార్హం. కేంద్ర పథకాలు రాష్ట్భ్రావృద్ధికి అందేలా కేంద్రం సహకారం ఎంతో అవసరమని అన్నారు. కాగా ఒడిశాలో సార్వత్రిక ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా జరిగాయి. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. నవీన్ ఐదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.