జాతీయ వార్తలు

యుపి రోడ్డు ప్రమాదాల్లో 10మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 22: ఉత్తరప్రదేశ్‌లో ఒకేరోజు జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో 10మంది దుర్మరణం చెందారు. మరో 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలి, బండా, బల్లియా, షాజనాపూర్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బరేలీ జిల్లాలోని బహేది ప్రాంతంలో కారు, ట్రాక్టర్ ట్రాలీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బల్లియా జిల్లాలోని నర్హి ప్రాంతంలో టెంపో బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. బండా జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో టెంపోను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 13మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. షాజనాపూర్‌లోని కలాన్ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ట్రాక్టర్‌ను ఓ బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.