జాతీయ వార్తలు

జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా ఆదిశంకరుడి జయంతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఆదిశంకరాచార్యుల జయంతి రోజైన మే 11న జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా పాటించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఎన్‌జివో సంస్థ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుడు పి పరమేశ్వర్ నవోదయం పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. కేంద్ర సాంస్కృతి వ్యవహారాల సహాయ మంత్రి మహేశ్ శర్మ ముఖ్యఅతిధిగా హాజరైన ఓ సమావేశంలో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆదిశంకరాచార్యుల జయంతిని జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా పాటించాలన్న ప్రతిపాదన తమకు అందిందని దాన్ని తాము పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.