జాతీయ వార్తలు

జ్యోతిరాదిత్య కారు ఢీకొని 65 ఏళ్ల వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలప్పుజా (కేరళ), ఆగస్టు 10: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణిస్తున్న కారు ఢీకొని 65 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొనందుకు ఈ యువనేత ఢిల్లీ నుంచి కొచ్చి చేరుకుని అక్కడనుంచి కారులో వెళుతుండగా ద్వితీయ వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని ఢీకొనడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. కారు కొచ్చి-అలప్పుజా హైవేలో వెళుతున్న సమయంలో పుతియకవు వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశామని, అయినప్పటికీ అతడు మృతిచెందాడని, ఈ సంఘటన చాలా దురదృష్టకరం’ అని జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తిని పుతియకవుకు చెందిన శశిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, మరో కారులో సింధియా వెళ్లిపోయారని కాంగ్రెస్ ఎంపీ కె.సి.వేణుగోపాల్ విలేఖరులకు తెలిపారు. కారులో సింధియాతోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం.