జాతీయ వార్తలు

ప్రభుత్వాలను పడగొట్టడం మొదలుపెట్టిందే కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం మొదలు పెట్టింది కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వామపక్ష నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. 1984లో ఏపిలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ తమ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించిన కరుణానిధి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసిందన్నారు. 1997లో జమ్మూకాశ్మీర్‌లో, గోవాలో మనోహర్ పారికర్ ప్రభుత్వాన్ని, మేఘాలయలో ఎన్సీపి ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న సమయంలో 90సార్లు రాష్టప్రతి పాలన విధించిందని వెంకయ్య పేర్కొన్నారు.