జాతీయ వార్తలు

సెంట్రల్ వర్సిటీకి నేడు కన్హయ్య రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకమార్ బుధవారం హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల స్నేహితులతో భేటీ అవుతారు. అనంతరం రోహిత్ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. కన్హయ్యకుమార్ కోసం హైదరాబాద్ హెచ్‌సియులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారం జాతీయ స్థాయిలో గొడవకు దారి తీసిన సంగతి తెలిసిందే. జెఎన్‌యులో అఫ్జల్‌గురు సంస్మరణ సభ, తదనంతర కార్యక్రమాల నేపథ్యంలో కన్హయ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. అరెస్టు తరువాత కుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌కు చెందిన కన్హయ్య హైదరాబాద్ పర్యటన కార్యక్రమాన్ని పార్టీయే పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. ఇలా ఉండగా కుమార్ మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు.
దేశద్రోహం నేరం కింద అరెస్టయిన కన్హయ్య కుమార్‌కు నైతిక మద్దతు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ రెండుసార్లు జెఎన్‌యుకు వెళ్లటం తెలిసిందే.