శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సాయి పాదుకలకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 21: శ్రీషిర్డీ సాయినాథుని దివ్యచరణ పాదుకలు శుక్రవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నాయి. స్థానిక అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు, చిల్డ్రన్స్‌పార్క్ సాయి మందిరం వ్యవస్థాపకుడు కొండ్రెడ్డి శ్రీనివాసులురెడ్డిలు, వందల సంఖ్యలో భక్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై బాబా పాదుకలు ఉంచి ఊరేగింపుగా చిల్డ్రన్స్‌పార్కులోని సాయిమందిరం దగ్గరకు తీసుకెళ్లారు. భక్తులు సాయిభజనలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మార్గంమధ్యలో వేమిరెడ్డి నివాసం వద్ద స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీపీఆర్ ఫౌండేషన్ కో చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతితో పాటు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం చిల్డ్రన్స్‌పార్కు సాయిబాబా మందిరం నుంచి సాయినాథుని పాదుకలు వీపిఆర్ కనె్వన్షన్ హాలుకు తీసుకెళ్లారు. శనివారం నుంచి కనుపర్తిపాడు సమీపంలోని వీపీఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో భక్తుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజల నడుమ భక్తులకు బాబా పాదుకలను దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు.