శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గూడూరులో అంబరాన్నంటిన సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఏప్రిల్ 8: గూడూరు శాసన సభ్యుడు పాశం సునీల్‌కుమార్ శుక్రవారం విజయవాడలో సిఎం చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గూడూరు నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు పెద్ద సంఖ్యలో పలు వాహనాల్లో విజయవాడకు తరలివెళ్లారు. ఎమ్మెల్యే వెంట పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, జడ్పిటిసిలు, గూడూరు పురపాలక సంఘంలోని 8 మంది వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుండి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు అభినందనలు తెలియచేస్తూ మేమంతా మీ వెంటే ఉంటాం, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడండి అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎమ్మెల్యేకి గాడ్‌ఫాదర్‌గా ఉన్న కొండేపాటి గంగప్రసాద్‌తో కలసి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న సందర్భంగా గూడూరులోని ఎమ్మెల్యే అభిమానులు బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొన్నారు. గూడూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు గూడూరు నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో తిరిగి స్వంత గూటికి ఎమ్మెల్యే చేరుకోవడం, స్థానికుడు కావడం, ఇక్కడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్న నమ్మకం ప్రజల్లో నెలకొని ఉంది. అందరినీ కలుపుకుపోయే మనస్థత్వం కల ఎమ్మెల్యే ఇకపై గూడూరు రాజకీయాలను ఏ విధంగా చక్కబెడతారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.