శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్మార్ట్ సర్వే సమర్థవంతంగా నిర్వహించండి: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలాఖరులోగా నూరుశాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. బోగోలు మండలం కోవూరుపల్లి అంబేద్కర్ కాలనీలో శుక్రవారం ప్రజా సాధికార సర్వే పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన ట్యాబ్‌లు, సిమ్‌లు, పరికరాలు సిద్ధంగా ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షకులు, నోడల్ అధికారులు నిర్ధేశించిన లక్ష్యాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయమై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, చంద్రన్న బీమా, ప్రభుత్వ పథకాల అమలు, తీరుతెన్నులపై పటిష్ట సమాచారం సేకరించాలన్నారు. సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించి నిర్ధేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. జెసి వెంట స్థానిక తహశీల్దారు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.