శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

న్యాయవాదుల కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 19: జమ్మూ-కాశ్మీర్‌లోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హతులైన భారత సైనికులకు సంఘీభావంగా నెల్లూరు న్యాయవాదులు సోమవారం రాత్రి జిల్లా కోర్టు ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ రోజారెడ్డి, ఉపాధ్యక్షుడు కుడుముల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు న్యాయవాదులతోపాటు బార్ మాజీ జనరల్ సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వీరు జై జవాన్ అని నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు తమ సంతాపాన్ని తెలిపారు.
బిజెపి లీగల్ సెల్ ఖండన
జమ్మూ కాశ్మీర్‌లోని యూరి గ్రామం వద్ద గల భారత సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి 17 మంది భారత సైనికులను హతమార్చిన సంఘటనను తీవ్రంగా నిరసిస్తున్నట్లు బిజెపి సిటీ, బిజెపి నెల్లూరు సిటీ, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్లు ఇఎస్ జగదీశ్వర్, రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో ఖండించారు. బాంబు దాడుల అనంతరం ప్రజలు అప్రమత్తమై వెంటనే సహాయ చర్యలు చేపట్టాలా సమావేశం కావాలని వారు పిలుపునిచ్చారు.