జాతీయ వార్తలు
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 April 2016
దిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎంపీలు, ప్రముఖ నేతలకు తొలుత సంతాపం ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో ఉభయ సభల్లో మొత్తం 24 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కీలకమైన జిఎస్టి బిల్లు కూడా ఉంది. ఉత్తరాఖండ్లో రాష్టప్రతి పాలన, దుర్భిక్ష పరిస్థితులు, మంచినీటి సమస్య, రైతు ఆత్మహత్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ప్రతిపక్షాలను బుజ్జగించైనా కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని అధికార పక్షం కసరత్తు చేస్తోంది.