జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోల్‌పై 58 పైసలు, డీజిల్‌పై 25 పైసలు
న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశంలో చమురు ధరలు మరోసారి దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ధోరణికి అనుగుణంగా లీటర్ పెట్రోల్‌పై 58 పైసలు, డీజిల్‌పై 25 పైసలు చొప్పున తగ్గించారు. తగ్గిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకూ రూ.60.70 పైసలుగా ఉన్న లీటర్ పెట్రోల్ మంగళవారం నుంచి రూ.60.48 పైసలకు లభిస్తుందని, అలాగే లీటర్ డీజిల్ ధర రూ.46.80 పైసల నుంచి రూ.46.55 పైసలకు తగ్గుతుందని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి వరుసగా మూడుసార్లు పెరిగిన డీజిల్ ధర ఈసారి స్వల్పంగా తగ్గడం గమనార్హం.