జాతీయ వార్తలు

దావూద్‌ను తీసుకొస్తాం: హోం మంత్రి రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పాకిస్తాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను త్వరలోనే పట్టుకుని భారత్‌కు తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దావూద్ నేరాలకు సంబంధించి తగిన సాక్ష్యాధారాలను ఇప్పటికే పాక్ సర్కారుకు అందజేశామని ఆయన మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. మతోన్మాద తీవ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐఎస్) వల్ల మన దేశానికి ముప్పు లేదన్నారు. అంతర్జాతీయ నిఘా సంస్థల సహకారంతో దావూద్‌ను పట్టుకుని ఇండియాకు తీసుకువచ్చాక కేసులు పెడతామన్నారు.