జాతీయ వార్తలు

ప్రజలకు చౌకీదారు కాదు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగంగానగర్: ప్రధాని నరేంద్ర మోదీ తాను ఎవరికీ చౌకీదారో ఇంతవరకు చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అనిల్ అంబానీ వంటివారికి చౌకీదారు అని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయలేదుకానీ అనిల్ అంబానీకి 30,000 కోట్లు లబ్ధిచేకూర్చారని అన్నారు. అలాగే 15మంది వ్యాపారవేత్తల రుణాలు మాఫీ చేశారని అన్నారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తారని హామీ ఇచ్చారని, రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కాని ఆయన చేసేందేమిటి 15మంది వ్యాపారవేత్తలకు మాత్రమే మోదీ రూ.3లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని అన్నారు. రెండు వేర్వేరు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు ఇది అని అన్నారు.