జాతీయ వార్తలు
కన్నడ నటి రమ్యపై దేశద్రోహం కేసు !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 August 2016
బెంగళూరు: పాకిస్థాన్ను ప్రశంసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కాంగ్రెస్ ఎంపీ, కన్నడ నటి రమ్యపై కర్నాటకలో దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవల ఇస్లామాబాద్లో సార్క్ సదస్సుకు హాజరైన ఆమె భారత్ వచ్చాక ‘అందరూ అనుకున్నట్టు పాకిస్థాన్ నరకమేమీ కాదు, అక్కడ మమ్మల్ని బాగా చూసుకున్నారు, అక్కడి జనం మనలాంటి వారే..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ను శత్రుదేశంగా భారత్ భావిస్తుండగా రమ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. పాక్కు అనుకూలంగా ఆమె మాట్లాడారన్న విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మదికేరికి చెందిన ఓ న్యాయవాది రమ్యపై దేశ ద్రోహం కేసు వేశారు. అది శనివారం విచారణకు రానుంది.