హైదరాబాద్

పెన్షన్ దారులు మీసేవలో నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్‌బినగర్, జూలై 19: ఎల్‌బినగర్ సర్కిల్ 3ఎ,3బి పరిధిలోని పెన్షన్ దారులు తమ వేలిముద్రలు, ఐరిస్‌లను మీసేవ లేదా ఈ-సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని సర్కిల్ 3ఎ, 3బి డిప్యూటీ కమిషనర్‌లు శ్రీనివాస్‌రెడ్డి, పంకజ తెలిపారు. సర్కిల్ పరిధిలో వికలాంగ, వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత పెన్షన్‌దారులు తమ వేలిముద్ర, ఐరిస్‌లను ప్రతి 6నెలలకు ఒకసారి మీసేవ, ఈసేవలలో నమోదు చేసుకోవాలని, లేకుంటే తమ పెన్షన్‌లు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై ఇబ్బందులు ఉన్నవారు, రెన్యువల్ చేయదలచిన వారు ఈ నెల 20న బుధవారం ఎల్‌బినగర్ సర్కిల్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5గంటల లోగా సంప్రదించాలని సూచించారు.