జాతీయ వార్తలు

రాజ్యసభకు 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 8 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో తమ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనందున పోటీ చేయరాదని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనందున అక్కడ ఆ పార్టీ పోటీ చేసే అవకాశమే లేదు. మహారాష్ట్ర నుంచి పి.చిదంబరం, పంజాబ్‌ నుంచి అంబికా సోనీ, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కపిల్‌ సిబల్‌, కర్ణాటక నుంచి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, జైరాం రమేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ప్రదీప్‌ టమ్టా, మధ్యప్రదేశ్‌ నుంచి వివేక్‌ టంఖా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఛాయా వర్మ పేర్లను ఖరారుచేసింది.