జాతీయ వార్తలు

గందరగోళంతో రాజ్యసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమ పార్టీ సభ్యుడు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో సోమవారం గందరగోళం ఏర్పడింది. ఎపికి ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లును చర్చించాలని వారు కోరారు. నిబంధనల ప్రకారం దీన్ని ఇపుడు చర్చించలేమని ఆగస్టు 6న సభలో ప్రవేశపెడతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని టిడిపి ఎంపీ సిఎం రమేష్ తెలిపారు. పోడియంలోకి వెళ్లి కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.