ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, ఫిబ్రవరి 4: కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని బలపనూరు సమీపంలో ఐచర్ వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఎద్దుల బండిని ఢీకొన్న ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు సైతం మృతిచెందాయి. బలపనూరుకు చెందిన ఉప్పరి సుబ్బరాయుడు (65) తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పనులకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఐచ్‌ర్ అదేమార్గంలో ఎదరుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీకొంది. ప్రమాదంలో ఉప్పరి సుబ్బరాయుడు, భార్య నాగలక్ష్మి (55), రెండో కుమార్తె సుజాత (40)తోపాటు రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి. అలాగే సుబ్బరాయుడు రెండో కుమార్తె సుమతి, వ్యవసాయ కూలీ జాకీర్ హుసేన్ తీవ్రంగా గాయపడ్డారు. సుమతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై రైతులు వరి తదితర ధాన్యాలు ఆరబెట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
chitram...
ఐచర్ వాహనం ఢీకొనడంతో ఎన్‌హెచ్‌పై
చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, ఎద్దు