జాతీయ వార్తలు
కేరళలో బంద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 November 2018
తిరువనంతపురం: కేరళలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. సంఘ పరివార్కు చెందిన ఓ సీనియర్ మహిళ అయ్యప్ప దర్శనానికి వెళుతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టును నిరసిస్తూ సంఘ పరివార్, హిందూ సంస్థలు అందోళనకు దిగాయి. ఇదిలా ఉండగా అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించటం లేదని సంఘ పరివార్ నేతలు తెలిపారు. కేరళ ప్రభుత్వ చర్యల వల్ల భక్తులు స్వామి పూజలు సరిగా చేసుకోలేకపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదిలావుండగా శబరిగిరులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారు. మరోవైపు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా బంద్ కొనసాగుతుంది.