జాతీయ వార్తలు

పంజాబ్‌కు దూరం కాలేదు: సిద్ధూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్ : పంజాబ్‌కు దూరంగా ఉండాలని బిజెపి నాయకత్వం తనకు చెప్పినందువల్లే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మీడియాకు తెలిపారు. పంజాబ్ కంటే ఏ రాజకీయ పార్టీ తనకు ఎక్కువ కాదని, సొంత ఇంటిని కాదని తాను ఎక్కడికీ పోలేనన్నారు. సొంత రాష్ట్రం,సొంత ప్రజలే తనకు ముఖ్యమన్నారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ బిజెపిని మాత్రం వీడలేదు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించలేదు. సిద్ధూ భార్య కూడా బిజెపిని వీడేది లేదని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.