జాతీయ వార్తలు

పాటలు చాలు.. ఇక విశ్రాంతి : గాయని ఎస్‌. జానకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ‘ ఇక పాటలు చాలనుకుంటున్నా.. విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా..’ - అని మధుర గాయని ఎస్‌. జానకి ప్రకటించారు. వేడుకల్లో సైతం ఇక పాడబోనని ఆమె ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన జానకి- 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్‌కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ‘10 కల్పనకల్‌’ అనే మలయాళ చిత్రం కోసం తాను పాడే జోలపాటే చివరిదని, మలయాళ పాటతో మానేయాలని ప్రత్యేకంగా అనుకోలేదు, అనుకోకుండా జరిగింది .. అది లాలి పాట.. నా మనసుకు చాలా నచ్చింది... అని జానకి తెలిపారు. గుంటూరులో జన్మించిన జానకి 1957లో తమిళ సినిమాతో గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు ఆమెకు లభించాయి.