శ్రీకాకుళం
హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
రణస్థలం, ఏప్రిల్ 22: హిందూ ధర్మాన్ని ప్రతీ ఒక్కరూ పరిరక్షించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. మండలంలోని కోష్ట గ్రామంలో శుక్రవారం శ్రీకోదండరామ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే హిందూ మతం అత్యంత ప్రాచుర్యమైనదని దీనిని అందరూ ఆచరిస్తున్నారని వివరించారు. ప్రపంచ దేశాలు భారతదేశ సంస్కృతిని కాపాడుతుండగా ఇక్కడివారు మాత్రం పాశ్చాత్య ధోరణికి అలవాటుపడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా మహిళలు కూడా హిందూ ధర్మ ఆచారం ప్రకారం కుటుంబ వ్యవస్థను నడపాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జగన్నాథం నాయుడు పాల్గొన్నారు.