శ్రీకాకుళం

బిఎస్‌ఎఫ్ జవాన్ మృతితో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, మే 17: మండలం దోసరి రామినాయుడు వలసకు చెందిన బిఎస్‌ఎఫ్ జవాన్ జి.రామకృష్ణ (28) మృతి చెందినట్లు సమాచారం అందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. అసొం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ తుపాకి మిస్ ఫైర్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగి మృతి చెందినట్లు అధికారులు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు తవిటినాయుడు, కామేశ్వరమ్మ, సోదరి హైమా బోరున విలపించారు. మూడు కుటుంబాలకు ఆధారమైన రామకృష్ణ మృతి చెందటంతో ఆ కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయారు. 12 ఏళ్లు కిందట బి ఎస్ ఎఫ్ జవాన్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ మృతి చెందిన సమాచారం స్థానిక పోలీసు స్టేషన్‌కు అందింది. అవివాహితుడైన రామకృష్ణ మృతదేహం బుధవారం మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.