శ్రీకాకుళం

ప్రతిభా అవార్డులు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 17: గత విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డులతో పురస్కరించింది. ఈ అవార్డులు అందుకున్న అభ్యర్థులకు రూ.20వేలు చెక్కులను అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వైస్ చాన్సలర్ ఎం.చంద్రయ్య మంగళవారం ఆయన ఛాంబర్‌లో అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉజ్వల భవిత సాధించాలని ఆయన సూచించారు. ప్రతిభా అవార్డులను పి.పుష్పలత, డి.అనూష, ఎం.రాజ్యలక్ష్మీ, కె. సావిత్రి, ఎస్ రోజ, బి. మోహనసౌజన్య, యు.లక్ష్మీ, కె.శ్రీరాములు, ఏ. ఉమామహేశ్వరరావు, ఎన్.సౌజన్య, కె.కమలలు దక్కించుకున్నారు. వీరిని రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపల్ పి.చిరంజీవు, డీన్ కామారాజు, పాలక మండలి సభ్యులు అడ్డయ్య, డాక్టర్ బాబూరావు, బరాటం లక్ష్మణరావు, ఎన్.జయరామ్, కెవిఏ నాయుడు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మైథిలీలు ఉన్నారు.