శ్రీకాకుళం

సమాచార వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలోని సమాచార వ్యవస్థ మరింత బలోపేతానికి బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సూచించారు. వినియోగదారులకు మెరుగైనసేవలు అందించేలా సెల్ టవర్లు నిర్మించాలన్నారు.
శుక్రవారం ప్రజాసధన్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ జి.ఎంతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష ఎంపి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలవారీగా సర్వే నిర్వహించి బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందని చోట్ల టవర్‌లు నిర్మించాలన్నారు. నిధులు సమస్య ఉంటే ఎంపిల్యాడ్ నుంచి కొంతమొత్తాన్ని తాను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటింటికీ ఇంటర్‌నెట్ అందించాలన్న సంకల్పానికి మీరంతా అండగా అంకితభావంతో కూడిన విధులు నిర్వహిస్తే లక్ష్య సాధన సులువవుతుందన్నారు.