శ్రీకాకుళం

పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూలై 4: తాతదండ్రుల నుండి సాగులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి భూవిస్తరణ ప్రాప్తికి మ్యుటీషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కొంగరాంపంచాయతీ ఏజిఎన్ పేట రైతులు ఇంచార్జ్ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం అందించారు. సుమారు 150మంది రైతులు సర్వే నెంబర్ 501నుండి 520వరకు 125 ఎకరాలు భూమి కలిగి ఉన్నారు. వీరందరికీ సాగు హక్కులు కల్పించడమే కాకుండా ఆక్రమణలు తొలగించి పంట రుణాలు అందివ్వాలని కోరారు. బచ్చు నర్శింగరెడ్డి అలపాన రమణ, దువ్వు తాతయ్య, బాకి బచ్చువాడు, బస లక్ష్మణతోపాటు మరికొంతమంది రైతులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఏకరువు పెట్టుకున్నారు. ఎటువంటి హక్కులు లేని కొంతమంది బినామీ డాక్యుమెంట్‌లు సృష్టించి బ్యాంకుల్లో మార్టుగేజ్ రుణాలు పొందుతున్నారని వీటిపై విచారించి సబ్ డివిజన్ వారీగా సాగులో ఉన్న రైతులకు అడంగల్, 1బి ప్రతిలను అందించి న్యాయం చేయాలని కోరారు.