శ్రీకాకుళం

‘అభివృద్ధే ధ్యేయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 19: పలాస మున్సిపాలిటీ ప్రజాభివృద్ధి తమ పాలకవర్గం ధ్యేయమని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం మొదటిగా 17,25వ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అనంతరం తన కార్యాలయంలో చినబాడంకు చెందిన శ్రీసంతోషిణి మహిళ పొదుపు సంఘానికి 5 లక్షల రూపాయలు రుణం, సైన ప్రసాద్ అనే వికలాంగుడుకు ట్రైసైకిల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పారిశుద్ధ్యం మెరుగుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, ప్రజా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు బల్లయ్య, కృష్ణమూర్తి, యోగి, వల్లభ, నర్శింహులు, లక్ష్మణ్, పి.మల్లేసు పాల్గొన్నారు.