శ్రీకాకుళం

సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 21 : వైకాపా నేతలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక లాయరుపేటలోని వృద్ధాశ్రమంలో గురువారం ఫ్రొఫెసర్ శమంతకమణి ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ప్రొఫెసర్ శమంతకమణికి సూచించారు. ఫ్రొఫెసర్ శమంతకమణి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రిం వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధాశ్రమానికి బియ్యం, కందిపప్పుతోపాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు శింగరాజు వెంకట్రావు, లంకపోతు అంజిరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, శీనారెడ్డి తదితరులున్నారు.