శ్రీకాకుళం

దొంగతనంపై క్లూస్ టీం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు, జూలై 21 : సంతనూతలపాడులో మినగా యలమందా, గోవిందమ్మల గృహంలో బుధవారం గుర్తుతెలియని దుండగులు చొరవబడి 54 వేల నగదు, జత బంగారు కమ్మలు, బంగారపు ఉంగరం దొంగలించారు. బాధితులు సోడా బండిపై జీవనం సాగిస్తూ నగదును, బంగారు వస్తువులను యధావిధిగా ఇంట్లో ఉంచి సోడాబండికి వెళ్లారు. కుటుంబానికి సంబంధించిన అప్పులు తీర్చేందుకు బెంగళూరులో బేల్దారి పనులు చేస్తున్న కుమారుడు పంపిన నగదును ఇంట్లో ఉంచారు. ఇది గమనించిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి చోరీ చేశారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులతో పాటు క్లూస్ టీమ్ దొంగతనం జరిగిన గృహాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును, పలు వస్తువులపై దుండగుల వేలిముద్రలను సేకరించారు. కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలపాలు కావడంతో యలమందయ్య, గోవిందమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎస్‌ఐ హుస్సేన్‌బాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.