శ్రీకాకుళం

నయవంచన బాబును నమ్మకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఆగస్టు 4: ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నయవంచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నమ్మవద్దని మాజీ మంత్రి తమ్మినేని పిలుపునిచ్చారు. పట్టణంలోని 7వ వార్డు పాతినవానివీధిలో గురువారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రారుణాలు మాఫీ చేస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని, పక్కా ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఆయా లబ్ధిదారుల నోట మట్టి కొట్టిందని సీతారాం అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను అధికారంలోనికి వచ్చిన వెంటనే రెగ్యూలర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి చిరు ఉద్యోగులను మోసం చేసందని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ ఒక బూటకమని రేషన్ బియ్యం, పెన్షన్ పంపిణీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని సీతారాం అన్నారు. వేలాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమపథకాలు మోర్రో మంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రమేష్‌కుమార్, వార్డు కౌన్సిలర్ చిన్నారావు, దుంపల శ్యామ్, అల్లంశెట్టి చిన్ని పాల్గొన్నారు.