శ్రీకాకుళం

బాబు మోసాలపై తిరగబడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: అమలు కాని హామీలతో అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలపై ప్రజలు తిరగబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
పార్టీ నేత పొన్నాడ రుషి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో బాగంగా స్థానిక 24వ వార్డు పరిధిలోని గూనపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించి బాబు మోసాలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు. నిరుద్యోగ భృతి రెండే వేల రూపాయలు ఇస్తామని చెప్పారు, డ్వాక్రా, రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. తీరా అధికారం వచ్చాక నిరుద్యోగ భృతి ఎలాగూ లేదు సరికదా రుణమాఫీలో సైతం మెలికలు పెట్టారని విమర్శించారు. ఇదిగో పరిశ్రమలు, అదిగో పరిశ్రమలు అంటూ గత రెండేళ్లుగా విదేశాల వెంట తిరిగిన బాబు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా నేటికి తీసుకురాగలిగారా అంటూ ప్రశ్నించారు. ఇదంతా అమాయకులైన ప్రజలను మభ్యపెట్టడానికే అంటూ మండిపడ్డారు. చంద్రబాబు దగా ఇక ఎంతకాలమో సాగదని, బుద్ది చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మున్సిపల్ మాజీ చైర్మన్ అంధవరపు వరహానర్శింహం, మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, డిసియంయస్ కృష్ణమూర్తి, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, ఎన్ని ధనుంజయ, టి.కామేశ్వరి, శిమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు.