జాతీయ వార్తలు
ఇక ట్వీట్లు తగ్గిస్తా: స్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 July 2016
దిల్లీ: నిత్యం ఎవరిపైనో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వివాదాస్పదుడిగా పేరు పొందిన బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇక కొన్నాళ్లు ట్విట్టర్లో తన వ్యాఖ్యలను తగ్గిస్తారట! ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్తో పాటు పలువురు ప్రముఖులపై ఆయన ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్బిఐ గవర్నర్పై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించడంతో స్వామి ఇపుడు కాస్త నెమ్మదించారు. అయోధ్యలో రామమందిరం, చెన్నై సూపర్కింగ్స్పై నిషేధం, జాతీయ రహదారులు... ఇలా తాను దృష్టి సారించాల్సిన అంశాలెన్నో ఉన్నందున ఇక కొన్నాళ్లయినా ట్వీట్లు తగ్గిస్తానని ఆయన ట్విట్టర్లో తాజాగా వెల్లడించారు. అయితే, ‘తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకుంటాయా?’ అని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు.