జాతీయ వార్తలు

తెలంగాణ పాలిట చీకటి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ ఆగస్టు 24: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్టత్రో ఒప్పదం కుదుర్చుకోవడాన్ని చీకటి రోజుగా భావిస్తున్నట్లు శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఢిల్లీలో బుధవారం షబ్బీర్ అలీ విలేఖరులతో మాట్లాడుతూ 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయంలో జరిగిన ఒప్పందానే్న మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కుదుర్చుకుని ఊరేగింపులు చేసుకుంటున్నారని ఆరోపించారు.
కింది రాష్ట్రాలను సంప్రదించకుండా ఎగువ రాష్ట్రాలు కృష్ణా,గోదావరి నదులపై ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాయన్నారు. తెలంగాణ భూ భాగంలో ప్రాజెక్టులు నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాగా, ఇండియన్ ఇస్లామిక్ స్టేట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.