జాతీయ వార్తలు

పెరిగిన పరిమితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13 : పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతను తీర్చే చర్యల్ని కేంద్రం చేపట్టింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న ఆంక్షల్ని సడలించింది. బ్యాంకు కౌంటర్లు, ఎటిఎమ్‌ల నుంచి తీసుకునే నగదు పరిమితిని, పాత నోట్లు మార్చుకునే పరిమితిని ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెంచింది. అత్యవసరంగా 500కొత్త కరెన్సీనీ అందుబాటులోకి తెచ్చింది. మారిన నిబంధనల ప్రకారం..పాత నోట్లను మార్చుకునే పరిమితి రోజుకు 4500 రూపాయలకు పెరిగింది. ఎటిఎమ్‌ల ద్వారా 2500 వరకూ నగదు తీసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. బ్యాంకుల నుంచి నేరుగా ఓ వారంలో తీసుకునే నగదు పరిమితిని 24వేల రూపాయలకు పెంచింది. రోజుకు పదివేల పరిమితిని తొలగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

చిత్రం.. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త 500 నోటును బ్యాంకునుంచి డ్రా చేసి ఆనందంగా
చూపిస్తున్న ఢిల్లీ యువకుడు