విశాఖ

ముంపుప్రాంతాల్లో ఎమ్మెల్యే పీలా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), సెప్టెంబర్ 26: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ముంపుకు గురైన ఆర్‌వి నగర్, ఊడేరుగ్రామాలను స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఆర్డీవో పద్మావతిలు సోమవారం పర్యటించారు. సోమవారం తెల్లవారి నుంచి ఎడతెరిపి లేని వర్షానికి నీరు నిలిచిపోయి ఇల్లులు సైతం ముంపునకు గురయ్యా యి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పీలా, ఆర్డీవో పద్మావతిలు హుటాహుటిన ఆయా గ్రామాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాల్లో త్వరగా సహా య చర్యలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అర్డీవో పద్మావతి, తహసీల్దార్ కృష్ణ మూర్తికి ఆదేశించారు. కోలనీలో నిలిచిపోయిన నీరును త్వరగా బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి గ్రామాలపై దృష్టి సారించి, ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పర్యటనలో సర్పంచ్ ఈశ్వరావు, దేశం నాయుకుడు కొణతాల శ్రీనివాసరావు, పచ్చికోరు రాము, పెంటకోట రాము, డాక్టర్ కెకెవిఎ నారాయణరావు, ఎంపిడివో వెంకటరమణ, ఇరిగేషన్ డిఇ ఎం రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.