విశాఖ

ఉద్యోగ భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, నవంబర్ 21: ఆంధ్రా యూనివర్శిటీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏయూ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. సహాయ అధ్యాపకుల పోస్టుల్లో కొనే్నళ్లుగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిని తొలగించి కొత్తవారికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని 14 యూనివర్శిటీల్లో సుమారు 1400 మంది ఒప్పంద సహయ అధ్యాపకులు పనిచేస్తున్నారని కాంట్రాక్ట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి అర్జునుడు పేర్కొన్నారు. ఒక్క ఏయూలోనే 117 మంది ఒప్పంద సహాయ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని, ఏపీపీఎస్సీ ద్వారా సహాయ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించిందన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒప్పంద సహాయ ఉపాధ్యాయులంతా రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒప్పంద సహాయ ఉపాధ్యాయుల పోస్టులను క్రమబద్దీకరించి, వారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఒప్పంద సహాయ అధ్యాపకులు పాల్గొన్నారు.