జాతీయ వార్తలు

బెంగాల్‌లో ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకటి, రెండు చోట్ల స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 53 నియోజకవర్గాల్లో అయిదో విడత పోలింగ్‌కు 14,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు రాష్టమ్రంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి మమత, ఆమెపై పోటీ చేస్తున్న నేతాజీ మనవడు చంద్రబోస్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఈరోజు ఓటుహక్కు వినియోగించుకున్నారు.